ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ…

ముఖ్యఅతిథిగా ఎస్సై రమేష్ బాబు

కేసముద్రం ఆగస్టు 30 జనం సాక్షి /
మండల కేంద్రంలో వినాయక చవితి ని పురస్కరించుకొని మట్టి గణపతి ప్రతిమలను తంగళ్ళపల్లి భాస్కర్ (సరస్వతి జ్యువెల్లర్స్)ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్సై రమేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ బాబు మాట్లాడుతూ… ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోతుందని కాలుష్య నివారణే మార్గంగా రంగులు,కెమికల్స్ తో తయారు చేసే విగ్రహాలను నివారించి మట్టితో తయారుచేసిన గణపతి విగ్రహాలను పూజించినట్లయితే కాలుష్యాన్ని నివారించడం వల్ల మానవాళికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.