ఉద్యమం ఉప్పెనలా ఉంది

తెలంగాణ సాధిస్తాం : కేసీఆర్‌
హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఉప్పెనలా మారిందని, తొందర్లోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం నగరంలోని తాజ్‌ డెక్కన్‌ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సోషల్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. 2001లో కారుచీకట్లో ప్రారంభ మైన ఉద్యమం నేడు ప్రభంజనమైందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. సర్కారు రాజకీయాలు చేసి రాష్ట్రంలో పంచాయతీరాజ్‌, సహకార ఉద్యమాలను చంపేశా యని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్ష నెరవేరే సమయంలో అంతా సంయమనంతో వ్యవహరించా లని సూచించారు. సీమాంధ్ర పెత్తదారి శక్తులు తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతూ దోపిడీని సాగిస్తున్నాయని, వాటికి త్వరలోనే చరమగీతం పడకతప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ అనేక పర్యాయాలు తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ఇంకా మోసాలు సాగబోవన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌, గాయకుడు దేశ్‌పతి శ్రీనివాస్‌, భరత్‌కు మార్‌, నర్సింహారెడ్డి, నర్సయ్య, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.