ఎంపీపీ కుమారుడి జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీ

బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : మండలంలోని మాంజిరాం తండా గ్రామంలోని అంగన్వాడి పాఠశాల ప్రాథమిక పాఠశాలలో ఎంపీపీ అజాడే జయశ్రీ కేవల్ సింగ్ కుమారుడు ఆదిత్యా రామ్ జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిలు స్వీట్స్ అందజేశారు అనంతరం విద్యార్థుల మద్యన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ కేవల్ సింగ్ మండల ప్రధాన కార్యదర్శి పెరుగు సంతోష్ టీచర్లు రాజశేఖర్ శివకుమార్ అంగన్వాడీ టీచర్స్ అనసూయ పిల్లలు తదితరులు పాల్గొన్నారు