ఎంపీపీ చంద్రమోహన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పండ్ల పంపిణీ…

కేసముద్రం సెప్టెంబర్ 23 జనం సాక్షి / మండల కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక ఎంపీపీ ఓలం చంద్రమోహన్ జన్మదిన వేడుకలు మిత్రులు,శ్రేయోభిలాషులు నాయకుల మధ్య ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఎంపీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వీరు నాయక్,వార్డు మెంబర్ పద్మ బాలు,ఎంపీటీసీలు సట్ల వెంకన్న, వెంకన్న, బాదావత్ శంకర్, రాము, మహేందర్, రమేష్, గోపి, భీమా నాయక్, కూన భద్రాద్రి,, రాజేందర్, ఖాదర్ బాషా తదితరులు పాల్గొనడం జరిగింది.