ఎంపీ పర్వేజ్ శర్మ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఐలేష్ కుమార్
కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి /  ఆదివారం రోజున తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఐలేష్ కుమార్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ని మర్యాద పూర్వకంగా కలసి సంఘిబావం తెలుపడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ…తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని అన్నారు.ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నదని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ బిజెపి ఎంపీ పర్వేజ్ శర్మ వాక్యాలను ఐలేష్ కుమార్ ఖండించారు. కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక బిజెపి చేస్తున్న ఆరోపణలు తగవని, ఇక నుండి మానుకోవాలని,  పర్వేజ్ శర్మ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఐలేష్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాగృతి పట్టణ అధ్యక్షులు సింగారపు శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.