ఎం కె కన్వెన్షన్ ను పరిశీలించిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య

కేసముద్రం ఆగస్టు 28 జనం సాక్షి /మున్నూరు కాపు సంక్షేమ సంఘం కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎంకే కన్వెన్షన్ ను ఆదివారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ ,ఖమ్మం ఉమ్మడిజిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు లు పరిశీలించడం జరిగినది .ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య మాట్లాడుతూ… మండల కేంద్రంలో ఇలాంటి అధునాతనమైన ఫంక్షన్ హాల్ ను నిర్మించడం అభినందనీయమన్నారు. ఇలాగే దీనిని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లా కేంద్రాలలో ఫంక్షన్ హాల్ నిర్మాణాలను చేపట్టాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన సలహాదారు తుంపిల్ల శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి,సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చందా గోపి, ప్రధాన కార్యదర్శి కమటం స్వామి, కోశాధికారి సింగంశెట్టి ఏకాంతం, కుల సంఘం మండల అధ్యక్షులు కమటం శ్రీనివాస్,ముత్యాల శివకుమార్, మండల కమిటీ నాయకులు ఆరుద్రపు శ్రీనివాస్, పిన్ని రాము, కమటం పెద్ద స్వామి, తోట నాగయ్య, కొణతం శ్రీనివాస్, కమటం శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.