ఎన్నికలొస్తే తెలంగాణమే హెడ్లైన్స్ టుడే సర్వే
టీఆర్ఎస్కు 11 పార్లమెంట్ స్థానాలు
హైదరాబాద్, మే 21 (జనంసాక్షి) :
ఎన్నికల్లో తెలంగాణవాదానికే ప్రజలు పట్టం కట్టనున్నారని జాతీయ మీడియా హెడ్లైన్స్ టుడే తన సర్వేలో వెల్లడించింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్కు 11 స్థానాలు దక్కడం ఖాయ మని పేర్కొంది. సీ ఓటర్, హెడ్లైన్స్ టుడే ఒపినియన్ పోల్స్లో తెలంగాణ వాదం తేటతెల్లమైంది. తెలంగాణ ప్రజలకు ప్రత్యే క రాష్ట్రం తప్ప వేరే ఎజెండాలు లేవని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హంగ్ ఏర్పడటం ఖాయమని పేర్కొంది. రాష్ట్రంలోని 42 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ తలా 11 స్థానాలు, కాంగ్రెస్ ఎనిమిది, టీడీపీ పది, ఎంఐఎం, బీజేపీ ఒక్కో స్థానాలు సాధిస్తా యని పేర్కొంది. అసెంబ్లీలో ఫలితాలు ఇలాగే ఉంటాయని తెలిపింది.