ఎన్‌బీఐ ఏటీఎంలో చోరీ

షాద్‌నగర్‌ : పట్టణంలోని ఎన్‌బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. బుధవారం అర్థరాత్రి దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. ఎంత మొత్తం చోరీ జరిగిందనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని షాద్‌నగర్‌ డీఎస్పీ మాదవరెడ్డి, సర్కిల్‌.ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌రెడ్డి, ఎస్సై సత్యనారాయణలు పరిశీలించారు.