ఎపికి పది బ్యాంకుల ద్వారా రూ.56,076 కోట్ల రుణం

రాజ్యసభలో వెల్లడిరచిన కేంద్రం
న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 2019 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకూ ఏ బ్యాంకు నుంచి ఎంత రుణం అందించిందో వివరాలను వెల్లడిరచింది. మొత్తంగా ఈ రెండేళ్లలో 10 బ్యాంకుల నుంచి రూ.56,076 కోట్ల రుణాలను ఎపి ప్రభుత్వం పొందిందని రాజ్యసభలో టిడిపి ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా బదులిచ్చింది. అత్యధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.15,047 కోట్ల రుణాలు అందాయని పేర్కొంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.9,450 కోట్లను రుణంగా ఇచ్చిందని తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.7,075 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.5,797 కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ.4,300 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ.2,800 కోట్లు, కెనరా బ్యాంక్‌ నుంచి రూ.2,307 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ నుంచి రూ.750 కోట్లను ఎపి రుణాలుగా పొందిందని వెల్లడిరచింది.