ఎమ్మెల్యే మణిక్ రావు ను కలిసిన విఆర్ఏలు

జహీరాబాద్ సెప్టెంబర్ 3 (జనంసాక్షి) తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జహీరాబాద్ డివిజన్ లోని ఆయా మండలాలకు చెందిన వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక  సమ్మె శనివారంతో 41వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో భాగంగా శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  శాసనసభ్యులు  కొనింటి మాణిక్ రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలం లోని విఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు.