ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో కారు బీభత్సం

 రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.