ఎర్రచందనం పట్టివేత

జానంపేట : మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం జానంపేట వద్ద రూ.2 కోట్లు విలువ చేసే 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఆర్టీఏ అధికారులు ఈ రోజు ఉదయం పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.