ఎల్గోయిలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…

సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ ఆధ్వర్యంలో

ఝరాసంగం ఆగస్టు 10 (జనం సాక్షి ) 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండలంలోని ఏల్గోయి గ్రామం లో సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ పంచాయతీ కార్యదర్శి దన్ రాజ్ సిబ్బంది,వివో ఏలు ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఓం ప్రకష్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు