ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

వరంగల్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  ఆర్మూర్‌ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్‌ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఎం దూర విద్యను అభ్యసిస్తున్న జీవన్‌రెడ్డి ఇవాళ ఉదయమే వరంగల్‌ పట్టణానికి చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్‌ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకు రాసిన అన్ని సెమిస్టర్లలో ఎమ్మెల్యే ఉత్తీర్ణుడయ్యారు. ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన అనంతరం పీహెచ్‌డీ కూడా చేస్తానని, దాంతో న్యాయవిద్యలో పరిజ్ఞానం పెరుగుతుందని జీవన్‌రెడ్డి వివరించారు.