ఎ ఎన్ ఎమ్ లు ఉపవాసం ఉండి పనిచేయాలా మంత్రి హరీష్ రావు

9 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న ఏఎన్ఎంలు-జోగు ప్రకాష్ జనగామ సిఐటియు జిల్లా కోశాధికారి
జనగామ (జనం సాక్షి )జూలై22 : సిఐటియు ఆఫీసులో జోగు ప్రకాష్ సిఐటియు జిల్లా కోశాధికారి మాట్లాడుతూ మా ఆరోగ్యం కంటే ప్రజల ఆరోగ్యమే శ్రేష్టము పనిచేస్తున్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఏఎన్ఎం లు గత నవంబర్ 29-11-2021న ప్రభుత్వం 37 మంది ని హార్మోన్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ ద్వారా జైను చేసుకోవడం జరిగింది కానీ ఉపవాసాలు ఉండి పనిచేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు నేటి కి 9 నెలలు గడుస్తున్న వారికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.ఈ మాసంలో పిల్లల స్కూలు స్టార్ట్ అయిన తర్వాత అప్పులు తెచ్చి పిల్లల బుక్స్ కొనడం కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాము అన్నారు కాబట్టి ఇప్పటికైనా జనగామ జిల్లా కలెక్టర్ స్పందించి ఏఎన్ఎములకు జీతాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో అందరిని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని అన్నారు.