ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర

తిరుపతిలో కోటీ 59 లక్షల అత్యధిక వేలం

అమరావతి,జూలై30(జనంసాక్షి): ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర రూ. కోటీ 59 లక్షల రూపాయలు పలికింది. వేలంలో కడప, తిరుపతి అధికార పార్టీ నేతలు పోటాపోటీగా పాల్గొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర బార్లకు ఈరోజు ఈ ఆక్షన్‌, మిగతా బార్లకు కూడా రూ.95 లక్షల్లో 90 శాతం వెచ్చించాల్సిందే. అనంతపురంలో కూడా పోటీ పెరగనుంది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు రాజీ చేస్తున్నారు. అనేక నగరాల్లో ఎమ్మెల్యేలు, అధికార పక్ష నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపారు. తిరుపతి బార్లు వేలం దగ్గర వైసీపీ నేతల మధ్య నువ్వానేనా అన్న రీతిలో పోటీ పెరిగింది. అధికార పార్టీ నేతల బెదిరింపులతో రాష్ట్రంలో మద్యం షాపులకు దరఖాస్తులు తగ్గాయి.