ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి

వరంగల్‌ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి రవీందర్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు అసుపత్రికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అధికారి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.