ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్

వరంగల్ :

వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజలింగం ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రాజలింగం లంచం డిమాండ్ చేశాడు.