ఐఈఆర్సి కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

ముదోల్,సెప్టెంబర్ 06(జనంసాక్షీ)మండల కేంద్రమైన ముధోల్ లోని విలీన విద్యా వనరుల కేంద్రాన్ని మంగళవారం రోజున సెక్టోరియల్ అధికారులు పరిశీలించారు.ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జి.మైసాజీ,సెక్టోరియల్ అధికారులు శ్రీదేవి,రాజేశ్వర్,ప్రవీణ్, నరసయ్య, తదితరులు,పాల్గొన్నారు.