ఐక్యంగా ఉంటేనే తెలంగాణ:కేకే

హైద్రాబాద్‌: తెలంగాణ నాయకులంతా ఒకటిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కెకె అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో మంత్రి జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో భేటీ అనంతరం మాట్లాడారు. తెలంగాణవాదుల్ని ఒకే తాటిపైకి  తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ను కూడా ఉద్యమంలో కలుపుకుఉ పోతేనే తెలంగాణ సాధ్యమని కెకె తెలిపారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖర్‌రావు నివాసానికి బయలు దేరి వెళ్లారు.