ఐటీసీ సహకారంతో వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

బూర్గంపహాడ్ జూలై 27(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహడ్ మండలం సారపాక సుందరయ్య నగర్ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చంగల్ రావు, సారపాక పంచాయితీ ఈవో మహేష్,  టి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల మహిళ అధ్యక్షురాలు యల్లాంకి లలితా కుమారి, సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీను, బాలి శ్రీహరి, నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచంద్రరావు, సోము లక్ష్మీరెడ్డి, ఏసోబు, బెజ్జంకి కనకాచారి, బండారు లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.