బనకచర్లపై రాజీలేదు

` ప్రాజెక్టుపై రేపు మంత్రి ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
` ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌, డిప్యూటీఅ సీఎం భట్టి ఇతర మంత్రులు
హైదరాబాద్‌(జనంసాక్షి):బనకచర్లపై రాజీలేని పోరాటం దిశగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. ఈ మేరకు రేపు హైదరాబాద్‌లోని డాక్టర్‌ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమం నిర్వహించునున్నారు. ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలతో పాటు మంత్రి వర్గం హాజరుకానుంది. పాల్గొననున్న లోకసభ,రాజ్యసభ, శాసనమండలి,శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్‌ లు,వివిధ కమిషన్ల చైర్మన్‌ లు,సభ్యులు. కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తల పెట్టిన గోదావరి-బనకచర్ల అంశంపై జులై 1 న రాష్ట్ర ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించాలని నిర్ణయించింది.తెలంగాణా రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికి నిజ నిజాలు తెలిపే విదంగా ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఆయన నీటిపారుదల రంగ అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బ తింటున్నాయాన్నది సమగ్రంగా వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 1 మంగళవారం రోజున డాక్టర్‌ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌ లో మద్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కు ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లతో సహా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం హాజరు కానున్నారు. అంతే గాకుండా తెలంగాణా రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ,లోకసభ సభ్యులు,శాసన మండలి,శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్‌ లు డైరెక్టర్‌ లు వివిధ విభాగాలకు చెందిన కమిషన్ల చైర్మన్‌ లు,సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.