తెలంగాణ వ్యవసాయానికి సహకరించండి
` అమిత్షాకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
నిజామాబాద్(జనంసాక్షి):రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ పసుపు రైతుల అనేక పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను గుర్తించి బోర్డును మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అందులోనూ ఇందూరుకు బోర్డు రావడం గర్వకారణమన్నారు. ఇందుకోసం ఎంపీ అర్వింద్ ఎంతో కృషి చేశారన్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్షాను పలుమార్లు కలిసి బోర్డు తీసుకురావడానికి కృషి చేసిన అర్వింద్ను అభినందించారు. తెలంగాణ రైతులను రాజులను చేయడానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ, అమిత్షా సహకారంతో ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు సాధించారని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు ఏళ్లుగా ఎదురుచూశారన్నారు. జాతీయ కార్యాలయం సైతం నిజామాబాద్లో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. 30ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా పనిచేశానని.. నాలాంటి సామాన్య కార్యకర్తకు పసుపుబోర్డు జాతీయ అధ్యక్షుడి హోదా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉన్నతి కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. పీఎం మోదీ ఆధ్వర్యంలో పసుపు ఎగుమతులను 2030 వరకు మరింత పెంచేందుకు బోర్డు తరపున కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపీలు ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బస్వా గార్డెన్ లో నిర్వహించిన జాతీయ పసుపు బోర్డు సమావేశానికి తరలివెళ్లారు.