ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ అను సంధానం చేసుకోవాలి.

పెద్దవంగర సెప్టెంబర్ 08( జనం సాక్షి) గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని ఎంపీటీసీ ఏదునూరు శ్రీనివాస్ తెలిపారు. గురువారం పెద్ద వంగర గ్రామపంచాయతీ వద్ద గ్రామ సమైక్య సంఘాలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వారి సందేహాలను నివృత్తి చేసి  ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ ఏవిధంగా అనుసంధానం చేసుకోవాలి అనే విషయంపై పూర్తిగా అవగాహన కల్పించారు. సమైక్య సంఘాల సభ్యులు గ్రామంలో  ఇంటింటికి తిరుగుతూ త్వరగా పూర్తి చేయాలని చూపించాడు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్ర శర్మ , ఉప సర్పంచ్ రాము, తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు లింగమూర్తి, వివోలో రఘుపతి, వసంత, మణెమ్మ మహిళా సంఘం సభ్యులు మొదలగువారు పాల్గొన్నారు.