ఓడిఎఫ్‌ కోసం కృషి

జనగామ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాను ఓడీఎఫ్‌గా మార్చేందుకు  ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం లక్ష్యాన్ని చేరేలా పనిచేయాలని అధికారులు అన్నారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  జిల్లాను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దే క్రమంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేయాలని, మరుగుదొడ్లకు కొత్తగా మంజూరు కావాల్సిన నిధులకు సంబంధించిన వివరాలు  పంపించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గ్రామ ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలని ఆదేశించారు.