కన్నీరుమున్నీరు అవుతున్న సిద్ధయ్య భార్య

మహబూబ్‌నగర్ : జడ్చర్ల శోకసంద్రమైంది. ఎస్‌ఐ సిద్ధయ్యకు పలువురు నివాళులర్పిస్తున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అవుతోంది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ అక్కడికి రావడంతో విషాదకర వాతావరణం నెలకొంది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అధికారిక లాంఛనాలతో సిద్ధయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.