కరీమాబాద్ బడి ఆవరణలో నిలిచిన నీరు

– విద్యార్థులు పడుతున్న అవస్థలు
– నీరు నిలవకుండా చేయాలని కోరుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు
వరంగల్ ఈస్ట్, జూలై 23 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిరంతరం కురుస్తున్న వర్షం కారణంగా నీరు  నిలిచింది.  దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని తరగతి గదుల్లోకి విద్యార్థులు వెళ్లాలంటే నీళ్లను దాటుకుంటూ బురదలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఉదయం ప్రేయర్ చదవాలంటే బయటకు రాలేని పరిస్థితి ఉంది. ప్రైమరీ పాఠశాల విద్యార్థులు క్లాస్ రూములోనూ ,వరండా ముందు ప్రేయర్ చదువుకున్నట్లు తెలిసింది .పాఠశాల మైదానం అక్కడ అక్కడ వంపుగా  ఉండడం వల్ల వర్షపు నీరు నిలుస్తుందని, సంబంధిత విద్యాశాఖ అధికారులు ఈ సమస్యను గుర్తించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా మొరం పోసి గ్రౌండ్ లో నీరు నిలువకుండా చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. సుమారు 1200  పైగా విద్యార్థులు ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని వారు వేడుకుంటున్నారు.