కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మైనార్టీల అభివృద్ధి: డీఎస్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మైనార్టీలు అభివృద్ధి చెందారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌ అన్నారు. గాంధీభవన్‌లో ఈ రోజు నిర్వహించిన పీసీసీ రాష్ట్రస్థాయి మైనార్టీల సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర మంత్రులు మాణిక్య వరప్రసాద్‌, అహ్మదుల్లా, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ వ్యవహారల పరిశీలకుడు, కేజీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.