కాంగ్రెస్ నాయకుల అరెస్టు

భూపాలపల్లి టౌన్ జూలై 21 (జనంసాక్షి);
ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి  పైన కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ.డి ద్వారా దాడులు చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే క్రమంలో భూపాలపల్లి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం  తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుండి ఈ.డి కార్యాలయం వరకు జరిగే రాలీ , దీక్షలో పాల్గొని నిరసన తెలపడానికి వెళ్ళడానికి సిద్దంగా ఉన్న భూపాలపల్లి కాంగ్రెస్ నాయకులను మందుగా అరెస్టు చేసి భూపాలపల్లి పోలిస్ స్టేషన్ కి తరలించడం జరగింది. ఈ సందర్బంగా భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్  మాట్లడుతూ…అక్రమ అరెస్టు తో ఉద్యమం అపలేరు అని అన్నారు .రాష్టంలో ఉన్న TRS ప్రభుత్వం బిజెపి కి బి టీం గా పని చేస్తుంది అని అన్నారు. అరెస్టు అయిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు పసునూటి రాజేందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, పొన్నగంటి శ్రీనివాస్, దాట్ల శ్రీనివాస్, అంబాల శ్రీనివాస్, బొడ్డు అశోక్, కేతిరి సుభాష్, చుంచుల మహేష్, నగునూరి రజినీకాంత్, ఉస్మాన్, పోతుగంటి భద్రయ్య, ఎండి అహ్మద్, రావుల శ్రీనివాస్ తదితరులున్నారు.