కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పర్పాలిన్ కవర్ల పంపిణీ

. జులై జనంసాక్షి (టౌన్)
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గుడిసెలు, తుప్పు పట్టి చిల్లు పడిన రేకుల ఇళ్లలో నివసిస్తూన్న వారికి గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ ద్వారా తెర్పోలిన్ కవర్లను ఉచితంగా అందజేశారు. ఈ కవర్లను ఇంటిపై కప్పుకొని ఇంట్లోకి నీరు రాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొంది జాగ్రత్తపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఆఫీస్ పటేల్, కాశీరాం, మైనార్టీ అధ్యక్షులు యూనుస్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రశాంత్,మక్సుద్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area