కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు

జులై 11 ( జనం సాక్షి):
మండలంలోని మామిండ్ల వీరయ్యపల్లె, నాగరాజు పల్లె గ్రామాలలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏడాకుల సంపత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నూతన గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షునిగా చెంచు కుమారస్వామి, గ్రామ యూత్ అధ్యక్షునిగా గోన విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షునిగా గోనె కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పలువురు వ్యక్తులు మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పాలన పై విసుకు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. కెసిఆర్ మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్నారని త్వరలోనే టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, గాదే సుదర్శన్, గోనె రాజిరెడ్డి, కోటి, రవి ,సుధాకర్ , అశోక్ ,గోవర్ధన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.