కాకతీయ మిషన్ పనులు ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

రంగారెడ్డి, ( ఏప్రిల్ 3): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  మహేందర్ రెడ్డి మిషన్ కాకతీయ పనులను జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు.  యాచారం మండలంలోని  చింతపట్ల లక్ష్మణ్‌ చెరువులో ఆయన మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.