కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలు..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి);
కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.విశ్వకర్మ చిత్రపటానికి రాష్ట్ర శాసనసభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి మొక్కుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.