కామారెడ్డి ప్రజాగోసలో పాల్గొన్న వివేక్‌

కామారెడ్డి,జూలై23(జనంసాక్షి): ప్రజా గోస ` బీజేపీ భరోసా యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేతలు పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేతలకు ఏకరువు పెడుతున్నరు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ వెంకటస్వామి పర్యటించారు. కాలినడకన తిరిగారు. అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పిట్లం మండలంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని విమర్శించారు. రోడ్లు బాగా లేకపోవడంతో వాహనదారులు, పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వేలాది కిలోవిూటర్ల రోడ్లను నిర్మించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోడ్ల విషయంలో చర్యలు తీసుకోవడం లేదంటూ ్గªర్‌ అయ్యారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి పిట్లం మండలంలో రోడ్లు వేయించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా స్థానికులకు హావిూనిచ్చారు.