కారులో మంటలు : వ్యక్తి సజీవదహనం

రంగారెడ్డి : శంకర్‌పల్లి మండలం మోగిల గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.