కారు బోల్తా : యువకుడు మృతి

రంగారెడ్డి (మొయినాబాద్) : మొయినాబాద్ మండలం కనకమామిడి గేటు సమీపంలో శుక్రవారం ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన సాయి(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.