కార్డన్‌ సెర్చ్‌లో పాతనేరస్థుల అరెస్ట్‌

రంగారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  చేవేళ్ల మండల కేంద్రంలో డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది పాత నేరస్తులను చేవేళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్డన్‌ సెర్చ్‌ లో ఇద్దరు డీసీపీలు, ఒక ఏసీపీ, నలుగురు సీఐలు, ఎస్సైలు, 185 మంది పోలీస్‌ ఫోర్స్‌ పాల్గొన్నారు. ఎవరైనా అనుమానితులున్నారా?? లేదా ఏదైనా నేరం చేసి ఒక్కడ తలదాచుకున్నారా అనే అనుమానంతో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహింమన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు డీసీపీ పద్మజ సూచించారు.