కార్పొరేట్ వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఊతమిస్తుంది

శివ్వంపేట అక్టోబర్ 12 జనంసాక్షి : వివిధ కారణాలవల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి వారిని ఆదుకుంటూ ఊతమిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన సాధు మాధవి శ్రీనివాస్ కు 44 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మన్సూర్ తన చేతుల మీదుగా అందజేశారు. బాధిత కుటుంబానికి ఈ చెక్కు మంజూరు పోవడానికి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ తన వంతు సహాయ సహకారం అందించారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అందుకు కృషి చేసిన మన్సూర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రఘు గౌడ్, సాదు ఆంజనేయులు, అల్లిపూర్ రాజు గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.