కార్మికవ్యతిరేక చర్యలను నిరసిస్తూ జూలై 7న హైదరాబాదులో మహాధర్నా.

* ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ విశ్వనాథ్టేకులపల్లి, జూన్ 28( జనం సాక్షి ): ప్రభుత్వరంగ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు,కార్మికుల వేతనాలు,సౌకర్యాలు,హక్కుల అమలు కొరకు జులై 7న హైదరాబాదులో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి L.విశ్వనాథo కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనoదఖనిలో తెలంగాణ మోటారు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన  మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథo మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిoచి వేస్తున్నాయని,44 కార్మిక చట్టాలను రద్దుచేసిన మోడీప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్ లను తెచ్చి జులై 1 నుండి అమల్లోకి తెచ్చేందుకు చూస్తున్నారని తెలిపారు.40 కోట్ల మంది కార్మికులకు ఉరితాడుగా మారే లేబర్ కోడ్ లను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టుతీర్పుప్రకారం.సింగరేణి, జి పి తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో సమానపనికి సమాన వేతనాలు అమలు చేయించాలని కేంద్ర,రాష్ట్ర.ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జూలై 1న హైదరాబాదులో జరిగే జె బి సి సి ఐ చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు సమాన వేతనం, ఎన్ సి డబ్ల్యూ ఏ సౌకర్యాలు అమలు చేసేందుకు పూనుకోవాలని జె బి సి సి ఐ ప్రాతినిధ్య సంఘాలు,గుర్తింపు సంఘంను ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికై జూలై 7న హైదరాబాదులో నిర్వహిస్తున్న మహాధర్నాలో పెద్దసంఖ్యలో సింగరేణి, ఆర్ టి సి,వైద్య,విద్య, రెవిన్యూ,మున్సిపల్, బి ఓ సి తదితర సంస్థలకు చెందిన ఉద్యోగులు,కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విశ్వనాథం పిలుపునిచ్చారు.
జూన్ 29న కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నాలో పాల్గొనoడి.

44 కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన 4 లేబర్ కోడ్ ల రద్దు, కార్మికులు,ఉద్యోగులు,కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అసంఘటితరంగం కార్మికుల సమస్యల పరిష్కారానికి జూన్ 29న కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రదర్శన,ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఎల్ విశ్వనాథం కోరారు. ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు కర్రి వాసు,శరత్, సాయి,సీతారామయ్య,నర్సింగ రావు,దేవ,సోమ,రాజు
తదితరులు పాల్గొన్నారు.