కాలానీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా : హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )కాలానీ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని శ్రీనివాస యాదవ్ అన్నారు  .  హస్తినాపురం డివిజన్లోని జనార్దన్ రెడ్డి నగర్ కాలనీ ప్రతినిధుల పిలుపు మేరకు నారగో ని శ్రీనివాసయాదవ్    , కాలనీ ప్రతినిధులతో కలిసి పర్యటించడం జరిగింది. గత రెండు సంవత్సరం ముందుక ఎమ్మెల్యే దెేవిరెడ్డి సుధీర్ రెడ్డి  చొరవ తో మంజూరు చేయించి  శంకుస్థాపన చేసిన విడిసిసి రోడ్ పనులు సంబంధిత కాంట్రాక్టర్ తో మన ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  మాట్లాడి  పనులు మొదలు పెట్టించారు. అలాగే కాలనీ లో పాత డ్రైనేజీ పైపులైన్ల సమస్యలు ఉన్నాయని కాలనీవాసులు తెలియజేసారు. ఈ సందర్భంగా నారగోని శ్రీనివాసయాదవ్   మాట్లాడుతూ కాలనీలోఎలాంటి సమస్య ఉన్న  ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో   మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనునాయక్  ,నాగిరెడ్డి , బిక్షపతి , కాలనీవాసులు ముఖ్యనాయకులు వెంకట్ రెడ్డిగారు,కే. నేపాల్ రెడ్డి ,ప్రకాశ్‌ , అమృత ,తదితరులు పాల్గొన్నారు .