కీసరలో లారీ బీభత్సం

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కారు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.