కుటుంబసభ్యుల దాడిలో వ్యక్తి మృతి

వనపర్తి : మండలపరిధిలోని శ్రీనివాసపూర్‌ పంచాయతీ పరిధీలోని బుడగంజంగాల కాలనీలో బాలరాజు అనే వ్యక్తి మంగళవారం రాత్రి కుటుంబసభ్యుల దాడిలో మృతి చెందాడు. బాలరాజు కుటుంబసభ్యులతో తరచు గొడవపడేవారు. మంగళవారం వదిన పద్మ కూలిపని చేస్తుండగా వెళ్లి కొట్డాడు. ఆమె ఇంటికి వచ్చాక కుటుంబసభ్యులు నలుగురు కలిసి రోకలిబండతో కొట్టారు. వనపర్తి ఆసుపత్రికి తరిలిస్తుండగా దారిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.