కురిమిద్ద గ్రామంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి నిరసన సెగ

ఇబ్రహీంపట్నం, నవంబర్16(జనంసాక్షి):-
యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది ఫార్మా సిటీలో మా భూములు గుంజుకొని ఏ ముఖం పెట్టుకొని మా గ్రామానికి వచ్చావని గ్రామానికి రావద్దంటూ ఫార్మా రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి మంచిరెడ్డిని అడ్డుకున్నారు ఈ సందర్భంగా నిరసన చేస్తున్న రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఓటు అనే ఆయుధం తో తగిన బుద్ధి చెప్తామని ఈ సారి ఇబ్రహీంపట్నం లో మంచి రెడ్డిని ఓడించడం ఖాయమని పార్మ రైతులు అన్నారు