కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకరుద్రంగి

రుద్రంగి ఆగస్టు 29 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యంది సోమవారం గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలు సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. పాఠశాలలో ప్రతి విద్యార్థి కనీసం 2.ని.ల పాటు ఇంగ్లీష్ పదం ఉపయోగించకుండా పూర్తిగా తెలుగు పదాలతో ఏదో ఒక అంశం పై మాట్లాడించే ప్రయత్నం చేయించడం జరిగింది.అదేవిధంగా ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతి విద్యార్థి ఆటలు ఆడేలా క్రీడల పట్ల శ్రద్ధ ఉండేలా అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, ప్రిన్సిపాల్ హరినాధ రాజు,ఉపాధ్యాయులు విజయ్ కుమార్,సూనీల్,సృజన్,రమేష్,గణేష్, రాము,విజయ్ చందర్,సంగీత,శ్రీలత, రాజశ్రీ,సంధ్య తదితరులు పాల్గొన్నారు.