కెటిఆర్‌ రాకతో పార్టీ మరింత బలోపేతం

తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌ : ఎర్రబెల్లి
జనగామ,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా యువనేత కేటీఆర్‌ నియామకంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ సముజ్జీగా సాగనుందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రెబెల్లి దయాకర్రావు అన్నారు. ఇంతకాలం కెసిఆర్‌ ఒక్కరిపైనే ఉన్న భారం ఇప్పుడు కెటిరా/-/- పంచుకోబోతున్నారని, దీంతో పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. సోమవారం ఆయన హైదాబాద్‌లో కెటిఆర్‌ బాధ్యతల స్వీకారానికి వెళ్లేముందు మాట్లాడుతూ  యువనేతకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం పట్ల టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా మరింత బలోపేతమవుతుందన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని, కేంద్రంలో నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాలకు సమయం ఇవ్వడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చడం కోసం కేటీఆర్‌కు పదవి కట్టబెట్టినట్లు తెలిపారు. నాలుగేళ్లలో తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని రాష్ట్రం బంగారు తెలంగాణ వైపు వైపు అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. అందుకే ప్రజలు బారీ మెజార్టీ కట్టబెట్టారని అన్నారు.  టీఆర్‌ఎస్‌ పాలనే తమకు శ్రీరామరక్ష అని ప్రజలు కోరుకుంటున్నారని ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధిక సీట్లు సాధించినట్లు జోగు రామన్న తెలిపారు. కేటీఆర్‌ నియామకంతో పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావడమే కాకుండా రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు.