కేంద్రమంత్రుల యాత్రలకు ప్రజల నిరసన

పలుచోట్ల అడ్డుకుంటున్న ఆందోళనకారులు
న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశవ్యాప్తంగా వివిద రాష్టాల్లో కేంద్ర మంత్రులకు రైతుల సెగ తగిలింది. కేంద్రమంత్రులు చేపట్టిన యాత్రలను రైతులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. తమనిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్‌ ఆశ్వీర్వాద్‌ యాత్రలో పాల్గొనడానికి వెళ్లిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే రైతు వ్యతిరేక ప్రకటనలపై ఆగ్రహించిన అన్నదాతలు ఆమెను అడ్డుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఢల్లీిలో ఆందోళన చేస్తున్న వారు నిజమైన రైతులు కాదని, కవిూషన్‌ ఏజెంట్లని ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై రైతులు మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని ఉదంసింగ్‌ నగర్‌లో జన్‌ ఆశీర్వాద్‌ యాత్రలో పాల్గనేందుకు వెళ్లిన కేంద్ర రక్షణ, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజరు భట్‌ కూడా రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి సంజీవ్‌ కుమార్‌ బాల్యాన్‌కు వ్యతిరేకంగా రైతు నేత రాకేష్‌ తికాయత్‌ అల్టిమేటం జారీ చేశారు. రైతు సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే, ఆయనను ఆ ప్రాంతంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఢల్లీి సరిహద్దుల్లో రైతు ఉద్యమం 265వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, షాజహాన్‌ పూర్‌, పల్వాల్‌ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జోరు వర్షంలో కూడా కొనసాగుతోంది. హర్యానా గ్రామాల నుండి వేలాదిమంది యువకులు టిక్రి, సింఘూ సరిహద్దుల వద్ద జరుగుతున్న ఆందోళనల వద్దకు తరలివచ్చారు. తమ గ్రామాల నుండి మట్టి, నీటిని ఆందోళన ప్రదేశాలకు తీసుకువస్తున్నారు. హర్యానాలోని ఫోగట్‌ ఖాప్‌ నుండి 75 మంది యువకులు టిక్రి సరిహద్దుకు చేరుకున్నారు. హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో ఎక్కడిక్కడే ఆందోళనలు, బిజెపి, దాని అనుబంధ పార్టీల నేతల బహిష్కరణలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ఎన్నికల నేపథ్యంలో ముజఫర్‌నగర్‌లో సెప్టెంబర్‌ 5న మహా పంచాయతీకి రైతు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సవిూకరణ సమావేశాలు తూర్పు ఉత్తరప్రదేశ్‌తో సహా వివిధ ప్రదేశాలలో జరుగుతున్నాయి.