కేజీబీవీ ఎస్ఎస్ సి విద్యార్థులకు సన్మానం

పెద్దవంగర జులై   (జనం సాక్షి )విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెట్టు నగేష్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారిని మంగళవారం మెమొంటోతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రణాళికతో చదివితే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. చదువు తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలన్నారు. పాఠశాలకు చెందిన లోకేశ్వరి, నక్షత్ర 9.5, సానియా 9.3, గౌతమి, శ్రావణి 9.2 జీపీఏ గ్రేడ్ సాధించారు. పదో తరగతి పరీక్షల్లో మండలంలోనే వందశాతం ఉత్తీర్ణత సాధించినందుకు కేజీబీవీ ప్రత్యేక అధికారి గంగారపు స్రవంతి, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాకనాటి రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, సైదమ్మ, కళ్యాణి, సంధ్యారాణి విద్యార్థులు పాల్గొన్నారు.