కేయూలో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్‌లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం మానివేసి నినాదాలు చేశారు. పరిశోధక విద్యార్థులు విశ్వవిద్యాలయం బంద్‌కు పిలుపునిచ్చారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.