కే ఓ సి ఉపరితల గనిని సందర్శించిన జిఎం నరసింహారావు

టేకులపల్లి,నవంబర్ 17( జనం సాక్షి): కోయగూడెం ఓసి ఉపరితల గనిని ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ నరసింహారావు గురువారం సందర్శించారు. కోయగూడెం ఓసి ప్రాజెక్టు అధికారి ఎన్.వి.ఆర్ ప్రహ్లాదును ఉపరితల గని నుండి ఉత్పత్తి, ఉత్పాదకత, బొగ్గు రవాణా వివరాలను అడిగి తెలుసుకున్నారు. గని న్యూ పాయింట్ నుండి గనిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించుకోవడానికి కే ఓ సి అధికారులకు తగిన సూచనలు సలహాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సౌరబ్ సుమన్, సర్వే అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.