కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

కొండమల్లేపల్లి అక్టోబర్ 15జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలం కేంద్రంలోని స్థానిక పట్టణంలోని బస్టాండ్ ను రోజున ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేసారు.బస్టాండ్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు,పరిసరాల పరిశుభ్రతలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం డిపో మేనేజర్ రాజీవ్ కుమార్ ప్రయాణికుల సౌకర్యార్ధం స్థానిక ఎంపిపి దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి తమ స్వంత ఖర్చులతో ఆర్టీసీ ఉద్యోగులకు కౌంటర్,ఎలక్ట్రిసిటీ వర్క్,లైటింగ్ సిస్టమ్,పెయింటింగ్,బస్టాండ్ లోపల ఫెన్సింగ్,చుట్టు మొక్కలు నాటించారని,ప్రయాణికులు బయట మల విసర్జన చేయకుండా చెట్లు నాటించి సూచికలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేసారని,అలాగే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఫ్యాన్లు మరియు మంచి నీటి వసతి మరియు కూడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం ఈడి యాదగిరి వారు చేస్తున్న పనుల పట్ల అభినందనలు తెలియచేస్తూ సంతోషం వ్యక్తం చేసారు.బస్టాండ్లోని పార్కింగ్ సెంటర్ను మరింతగా విస్తరించాలని, బస్టాండ్ లోని హోటల్ ను మరమ్మత్తులు చేయించుకొని ప్రయాణికుల సౌకర్యార్ధం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లేని యెడల సీజ్ చేసేలా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జి.వి నారాయణ,ఎన్.వి నారాయణ, సిబ్బంది జబ్బు వెంకటయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.